30.7 C
Hyderabad
April 19, 2024 09: 52 AM
Slider ఆదిలాబాద్

కెసిఆర్ రాజకీయ చరిత్రలో అతిపెద్ద మోసం ఇది

రిజర్వేషన్ పెంపు పై కెసిఆర్ మోసపూరిత వాగ్దానం చేసారని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కెసిఆర్ చేసిన అన్ని వాగ్దానాల మాదిరిగా ST రిజర్వేషన్ లో కూడా మోసం చేశారన్నారు. మేమున్నదే జనాభా లో 10 శాతం మాకు 12 శాతం అవసరం లేదన్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కెసిఆర్ కు రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు కనిపిస్తలేవన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చెయ్యట్లేదు, రైతులను నిరుద్యోగులను మోసం చేయడం తాప్ప ఇంకేమి చేయలేదన్నారు. ST రిజర్వేషన్ ను 10 శాతం పూర్తి స్థాయిలో అమలు పర్చాలని ప్రతి మండల కేంద్రం లో ఈ నెల 18 న MRO కు వినతి పత్రం అందచేస్తున్నామని అన్నారు.

ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం ప్రకారం స్థ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. స్థ లను మోసం చెయ్యాలనే ఉద్దేశం తోనే ST రిజర్వేషన్ బిల్లును మైనారిటీ బిల్లుతో కలిపి పంపించారన్నారు. ST జనాభా ఎంత ఉందొ అంత శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ST రిజర్వేషన్ కు సంభందించిన బిల్లును ప్రత్యేకంగా కేంద్రానికి వెంటనే పంపితే అక్కడి నుండి ఆ బిల్లును పాస్ చేయించే భద్యత మదన్నారు. ఈ విషయంలో MRO లకు మెమోరాండం ఈ నెల 18 న సమర్పిస్తున్నామన్నారు. ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు ముకుందరావు, స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ దీపక్ సింగ్ షెకావత్,జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు శివకుమార్ జైస్వాల్,పార్టీ మండల అధ్యక్షుడు ఆరేల్లి రాజలింగం,మాజీ pacs ఛైర్మెన్ దిలీప్ మొరే,ఇంద్రవెల్లి మాజీ ఉపసర్పంచ్ మాస్కె రాజవర్ధన్,తుకారాం,నూర్ సింగ్ నాయుకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

Bhavani

బోయినపల్లికి ప్రణాళికా సంఘం

Satyam NEWS

సాగు,త్రాగునీరు అందించడమే  తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment