ఆర్టీసీ కార్మికులు ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వ లో విలీనం విషయంలో వెనక్కు తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మిగతా డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపి కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు. వాళ్ళు దిగివచ్చారు కనుక చర్చలు జరిపితే మంచిది. సరెండర్ కావడం కూడా గెలుపే అని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లలో చాలా సహజమైన డిమాండ్లు ఉన్నాయి. 48 వేల మంది కార్మికుల విషయంలో ఎలాంటి స్పందన లేకుండా ఉండడం ఏ రకమైన న్యాయం అని ఆయన ప్రశ్నించారు. కోర్ట్ మాజీ న్యాయ మూర్తుల కమిటీ అంటే వద్దంటారు. కోర్ట్ అక్రమ సమ్మె కాదు అంటే మీర అక్రమం అంటారు. ఎస్మా ప్రయోగం చేస్తారు ఏమిటి ఇది అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సామరస్య పూర్వక పరిష్కారం చూపించాలని, ఇందులో రాజకీయాలు వద్దని ఆయన అన్నారు.
previous post