రెండు వారాలుగా అధికారిక నివాసం ప్రగతి భవన్ కు దూరంగా ఉన్న తెలంగాణ సిఎం కేసీఆర్ నేడు మళ్లీ ప్రగతి భవన్ కు వచ్చారు. గత రెండు వారాలుగా ఆయన ఎర్రవెల్లి ఫామ్ ఫౌస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై పలు రకాల వదంతులు పుట్టుకువచ్చాయి. ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అనే ఆందోళన పలువురిలో నెలకొంది.
దీనిపై అధికార పార్టీ ఏ మాత్రం వ్యాఖ్యలు చేయకుండా గుంభనంగా వ్యవహరించడంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తన ఆందోళన తీవ్రతరం చేయడం, కొందరు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో ఏదో జరుగుతున్నదనే అనుమానాలు బలపడ్డాయి. అయితే ఆయన నేడు ప్రగతి భవన్ కు చేరుకోవడంతో వచ్చిన పుకార్లన్నీ అబద్ధమేని తేలింది.