28.7 C
Hyderabad
April 25, 2024 04: 38 AM
Slider ముఖ్యంశాలు

21న ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ ఎంజిఎం సందర్శన

#CMKCR19

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న విధానం, సౌకర్యాలు, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు సమాచారం.

కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆయన సందర్శిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోమరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు వారు చేస్తున్న సేవను అభినందించారు.

అదే క్రమంలో వరంగల్ ఎంజిఎంలో కూడా సందర్శించి, మెరుగైన సౌకర్యాలు, బాధితుల్లో ధైర్యం నింపనున్నారు. గాంధీ ఆసుపత్రి సందర్శనలో ముఖ్యమంత్రి కేసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేవలం మాస్కులు మాత్రమే ధరించి సందర్శించి, కరోనా బారిన పడినా భయాందోళనలు వద్దని పరోక్షంగా చెప్పినట్లైంది. ఎంజిఎం సందర్శనకు కేసిఆర్ తో పాటు మంత్రి హరీష్ విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.

Related posts

ఎలారమింగ్: కరోనా వైరస్ తో రెండో వ్యక్తి మృతి

Satyam NEWS

నీతులు చెప్పే ఆ రెండు పత్రికలు చేస్తున్నదేమిటి?

Satyam NEWS

డిసెంబరు 6న 7వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Satyam NEWS

Leave a Comment