27.7 C
Hyderabad
March 29, 2024 02: 45 AM
Slider తెలంగాణ

రాజన్న సన్నిధిలో తెలంగాణ సిఎం కేసీఆర్

kcr 30 2

వేములవాడ శ్రీ  రాజ రాజేశ్వరస్వామివారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం దగ్గరకు చేరుకున్న ముఖ్యమంత్రి కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపి జోగిని సంతోష్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.

ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్, శాసనసభ్యులు విద్యాసాగర్ రావు, డాక్టర్ రవి శంకర్, సంజయ్ కుమార్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్మన్ నేల కొండ అరుణ, ఐసిడిఎస్ చైర్మన్ ఈద శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజ తరువాత ముఖ్యమంత్రి మధ్య మానేరు జలాశయాన్ని పరిశీలించారు.

Related posts

కార్మిక చట్టాలను కాలరాస్తున్న మోదీ సర్కార్: ఏఐటియుసి

Bhavani

ఘనంగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

వ్యాయామ ఉపాధ్యాయుడు డా.మోహన్ కు ఉగాది పురస్కారం

Satyam NEWS

Leave a Comment