భవానీపుర్ ఉప ఎన్నికలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడిపోయిన మమతా బెనర్జీ ఈసారి భవానీపుర్ నుంచి బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
ఆమెపై భారతీయ జనతా పార్టీ తరఫున ప్రియాంక టిబ్రేవాల్, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీ పడ్డారు. ఈ ఉప ఎన్నికలో తొలి రౌండ్ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగింది.
రౌండ్ రౌండుకు మమతా బెనర్జీ మెజారిటీ పెరిగి 50 వేలకుపైగా చేరింది. ఈ విజయంతో ఆమె సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నట్లు అయింది.