ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు మూడు రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నా తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛానెళ్లు, పత్రికలు చేస్తున్న విష ప్రచారానికి ఈటెల అదరడు, బెదరడు అని ఆయన అన్నారు.
ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చాక తన భవిష్యత్తు నిర్ణయం పై ఆలోచిస్తానని ఈటల చెప్పారు.