గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం వైయస్.జగన్ ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దోషికి కఠినశిక్ష పడేలా చూడాలని సీఎం కోరారు.
హత్యకు గురైన అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.