ఇంత కాలం ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగం మొత్తం తానే అయి నడిపిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా, సాధరణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అధికారం చెలాయించిన ప్రవీణ్ ప్రకాశ్ ఢిల్లీ వెళ్లబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గత నెలలోనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిలీవ్ అయి ఢిల్లీ వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాశ్ ప్రయత్నాలు ప్రారంభించారు. అవి ఇప్పటికి ఫలించినట్లుగా తెలిసింది.
ఆయన స్థానంలో ప్రస్తుత ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ వస్తారని కూడా తెలిసింది. ఎస్ ఎస్ రావత్ ను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించబోతున్నారు.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్న ముత్యాల రాజు గానీ, విశాఖ పట్నం కలెక్టర్ గా ఉన్న వినయ్ చంద్ గానీ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి రావచ్చునని తెలిసింది.