38.2 C
Hyderabad
April 25, 2024 11: 19 AM
Slider నల్గొండ

పేద  ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం భరోసా

#MLASaidireddy

ఆరోగ్యం సరిగా లేక ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఆరోగ్యానికి చేయూత నిచ్చే పథకం CMRF పథకమని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సీతారాంనగర్ కు చెందిన కొత్త జయమ్మ W/o చిన్న వెంకటేశ్వర్లు,చింతలపాలెం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన కుమారి కె. ఐశ్వర్య D/o పాపారావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా వీరికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి జయమ్మ కు 3 లక్షల రూపాయలు,ఐశ్వర్య కు లక్షా యాభై వేల రూపాయలు  మంజూరు అయినట్లు తెలిపారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నియోజకవర్గ శాసనసభ్యుడు సైదిరెడ్డి అన్ని తానై ప్రత్యేక శ్రద్ద వహించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించినందుకు బాధితులు సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడు సైదిరెడ్డికి ఋణపడి ఉంటామని,పేద ప్రజలకు అండగా ఉన్నందుకు వారికి ప్రత్యేక  ధన్యవాధాలు తెలిపారు.

Related posts

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

Satyam NEWS

ఢిల్లీ ఫైర్: ఇప్పటికి 35 మంది మృతి

Satyam NEWS

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment