ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క నేడు లబ్దిదారులకు పంపిణీ చేశారు.
వెంకటా పూర్ మండలం లక్ష్మి దేవి పేట గ్రామానికి చెందిన ముడికే రమాదేవి,ఇంచేర్ల కనక లక్ష్మి అదే విధంగా ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన నరేష్ కు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, ఎంపీటీసీ బానోత్ భాస్కర్,
ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నోజు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నల్ల కోటి గజవేని రఘు, రవి,తదితరులు పాల్గొన్నారు.