రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామపంచాయతీ బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల పాలిట వరమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన 91 వేల రూపాయల చెక్కులను శనివారం బాధితులకు అందజేశారు.
అదేవిధంగా మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామ పంచాయతీకి చెందిన మాజీ ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి వృద్ధాప్యంతో దివంగతులైన ఆయన మృత మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆమన్గల్ ఎంపీపీ అతిథిగృహంలో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ అంశాలపై పత్రికా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగ నాయకులు ఆయనకు జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిత విజయ్ జంగయ్య కసిరెడ్డి వెంకటరెడ్డి జంగయ్య కోట శ్రీను గాజుల శీను మహేష్ శ్రీను నాయక్ అల్లా జి రవీందర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు