30.7 C
Hyderabad
April 19, 2024 07: 20 AM
Slider హైదరాబాద్

బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సిఎం సాయం

#amberpet

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందింది. హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ కృష్ణా నగర్ కు చెందిన మాస్టర్ రాకేష్ అదుదైన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాస్టర్ రాకేష్ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కొంత సాయం అందేలా చేశారు.

సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన 3,50,000/- రూపాయల చెక్కును  శనివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో రాకేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అందచేశారు.

ఈ కార్యక్రమంలో భరత్ రాజ్, కాలేరు రాజు, వర్మ, నరేష్, కమలాకర్ పాల్గొన్నారు.

Related posts

అకాల వర్షా బీభత్సానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంట

Satyam NEWS

ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

Satyam NEWS

పోలీసుల మెడకు చుట్టుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్డు భూ వివాదాలు

Satyam NEWS

Leave a Comment