Slider హైదరాబాద్

బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సిఎం సాయం

#amberpet

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందింది. హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్ కృష్ణా నగర్ కు చెందిన మాస్టర్ రాకేష్ అదుదైన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాస్టర్ రాకేష్ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కొంత సాయం అందేలా చేశారు.

సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన 3,50,000/- రూపాయల చెక్కును  శనివారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో రాకేష్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అందచేశారు.

ఈ కార్యక్రమంలో భరత్ రాజ్, కాలేరు రాజు, వర్మ, నరేష్, కమలాకర్ పాల్గొన్నారు.

Related posts

పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు

Satyam NEWS

దెందులూరులో ప్రతిష్టాత్మకంగా జగనన్నే మా భవిష్యత్తు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!