ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పుట్టపర్తి జిల్లాలో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యానించారని ఆయన అన్నారు.
వాళ్లు అసలు రైతులే కాదు అనడం ఆ కుటుంబాలను అవమానించడమేనని మనోహర్ అన్నారు. ‘‘మాతో కలిసి పరామర్శకు వస్తే వాళ్లు రైతులో కాదో చూపిస్తాం. ఆ కుటుంబాలు ఎన్ని బాధల్లో ఉన్నాయో చూపిస్తాం’’ అని ఆయన అన్నారు. రైతులను అవమానపరిచినందున తక్షణమే రాష్ట్ర రైతాంగానికి జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.