రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహం నిమిత్తం ఈ నెల 4న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి కాకినాడ జిల్లా తుని శ్రీ రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్, రోడ్డు మ్యాప్ తదితర ఏర్పాట్లను రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, ఎక్సైజ్, విద్యుత్, డ్వామా పురపాలక, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజి, కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా, అనకాపల్లి జిల్లా కలెక్టరు రవికుమార్ పటాన్ శెట్టి, కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు, పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు, సీఎం సెక్యూరిటీ సిబ్బంది తదితర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.