ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన రద్దయింది. ఈ నెల 23న విశాఖలో సుమారు రెండు గంటల పాటు వివిధ ప్రారంభోత్సవాల కోసం జగన్ రానున్నట్టు రెండ్రోజుల కిందట షెడ్యూల్ ఖరారైన విషయం తెల్సిందే. ఇక్కడి ఎంజీఎం పార్కులో శనివారం రాత్రి జరగనున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె స్వాతి శ్రీవిద్య వివాహానికి కూడా ఆయన హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన విశాఖ పర్యటన రద్దయింది. వాస్తవానికి వైసీపీ అగ్ర నేత.. రాజ్యసభ సభ్యులు.వి. విజయ సాయి రెడ్డి కూడా విశాఖ వచ్చి సీఎం రాకపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. వివిధ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటన కాస్త రద్దయినట్టు తెలియడంతో వైసీపీ నేతలు కూడా కాస్త నిరుత్సాహపడ్డారు.