అనారోగ్యంతో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు అందచేశారు. మొత్తం ఏడుగురు బాధితులకు ఈ చెక్కులను అందచేశారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహాయ నిధి నుండి ఈ చెక్కులు మంజూరయ్యాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బాధితులకు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు: 1)శ్రీశైలం (కోడేర్) రూ. 3,50,000, 2)రాములు (తీగల పల్లి) రూ.30,000, 3)ఎల్లయ్య (తుర్కదిన్నె) రూ.12,000, 4)అనిల్ కుమార్ (నాగులపల్లి) రూ.29,000, 5) కౌసర్ హుస్సేన్ ( కొల్లాపూర్) రూ. 18,000, 6)రామస్వామి (మాధవ స్వామి నగర్ ) రూ. 22,000, 7)రాముడు (పెంట్ల వెల్లి) రూ. 16,000 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ కాటన్ జమలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సెల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయక్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్ర చంద్ర శేఖర చారి తదితరులు పాల్గొన్నారు.