39.2 C
Hyderabad
March 29, 2024 16: 07 PM
Slider మహబూబ్ నగర్

ఏడుగురికి సిఎం సహాయ నిధి చెక్కులు

kollapur 18

అనారోగ్యంతో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు అందచేశారు. మొత్తం ఏడుగురు బాధితులకు ఈ చెక్కులను అందచేశారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహాయ నిధి నుండి ఈ చెక్కులు మంజూరయ్యాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బాధితులకు అందజేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు: 1)శ్రీశైలం (కోడేర్) రూ. 3,50,000, 2)రాములు (తీగల పల్లి) రూ.30,000, 3)ఎల్లయ్య (తుర్కదిన్నె) రూ.12,000, 4)అనిల్ కుమార్ (నాగులపల్లి) రూ.29,000, 5) కౌసర్ హుస్సేన్ ( కొల్లాపూర్) రూ. 18,000, 6)రామస్వామి (మాధవ స్వామి నగర్ ) రూ. 22,000, 7)రాముడు (పెంట్ల వెల్లి) రూ. 16,000 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ కాటన్ జమలయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సెల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయక్, ఎమ్మెల్యే  వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్ర చంద్ర శేఖర చారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అమరవీరుల వర్ధంతి సభలు

Murali Krishna

నీటి వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

Satyam NEWS

డేంజర్ బెల్స్: వద్దంటే చేయడమే వారి నైజం

Satyam NEWS

Leave a Comment