రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల ఆశాజ్యోతి అని టీఆర్ఎస్ అంబర్పేట నియోజకవర్గ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. బాగ్ అంబర్పేట్ డివిజన్ లో ని మల్లికార్జున్ నగర్ నివాసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రాసాల అశోక్ యాదవ్ కి గుండె ఆపరేషన్ జరిగింది.
పేద కుటుంబం కావడంతో గుండె ఆపరేషన్ కు ఖర్చు శక్తికి మించింది అయింది. విషయం తెలుసుకున్న దూసరి శ్రీనివాస్ గౌడ్ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఆయన సి.యం.ఆర్.ఎఫ్ కు దరఖాస్తు చేయించి రూ.60,000/- మంజూరు చేయించారు. సదరు చెక్కును దూసరి శ్రీనివాస్ గౌడ్ రాసాల అశోక్ యాదవ్ కుమార్తె కావ్యకు అందచేశారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మంత్రి తన్నీరు హరీష్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు.