33.2 C
Hyderabad
April 26, 2024 01: 17 AM
Slider మహబూబ్ నగర్

నిరుపేదల పాలిట వరం CMRF పథకం

#kollapurmla

ముఖ్యమంత్రి సహాయ నిధి పథం పేదలకు వరం లాంటిదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ముక్కిడిగుండం గ్రామ నివాసి లావుడ్య రెడ్యా కుమారుడు లావుడ్య చందర్ యాక్సిడెంట్ కు గురి అయ్యాడు. దాంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయించారు. పేద ప్రజలు అత్యవసర స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారికి అందచేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి ని మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి కి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మండలం అధ్యక్షుడు ముచ్చర్ల రామచందర్ యాదవ్, గోపీ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

భగత్ సింగ్ ఆశయ సాధనకు పునరంకితంకండి

Murali Krishna

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Satyam NEWS

ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా కొట్టిన భర్త

Satyam NEWS

Leave a Comment