ములుగు జిల్లా దేవ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆడి దాల పద్మ అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ సహకారంతో దరఖాస్తు చేసుకొగా 60 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కు మంజురయింది.
ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నేడు బాధితురాలికి చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో దేవ నగర్ సర్పంచ్ రాములు దేవ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమారస్వామి యువజన విభాగం నాయకులు రేణిగుంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.