పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నల్గొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గంలోని 7మండలాలకు చెందిన 15మందికి రూ.3.16 లక్షల సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ బాధితులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు. ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువుగా అదుకుంటుంది అని ఆయన తెలిపారు.
మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది.
బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్,సీతారాం,తదితరులు పాల్గొన్నారు.