సిఎం రిలీఫ్ ఫండ్ పేదల జీవితాలలో వెలుగు నింపేదుకు సిఎం కేసీఆర్ పథకాన్ని ప్రారంభించారని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం డివిజన్కు చెందిన మల్లేష్ అనారోగ్యంతో సిఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకోగా మంజూరి అయిన 44000 వేల రూపాయల ఎల్వోసిని ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి లబ్దిదారుడైన మల్లేష్కు అందజేశారు.
ఈకార్యక్రమం హప్సిగూడలోని ఎమ్మేల్యే క్యాంపు ఆపీసులో బుదవారం జరిగింది. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్, నాచారం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ముత్యంరెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు విఠల్యాదవ్, రామంతపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ జెసిబి రాజు, సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.