రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని లబ్దిదారుల కుటుంబాలకు బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. రేఖ్య తండాకి చెందిన కె లచ్చి భర్త సోమ్ల కు 16000 రూపాయల చెక్కును, మాడ్గుల్ మండలం అన్నెబొయిన్ పల్లి గ్రామానికి చెందిన చరణ్ తేజ తండ్రి దశరథం కు 17500 రూపాయల చెక్కును, అదేవిధంగా తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య తండ్రి రాజరమాయ్య కు100000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.
అదేవిధంగా కడ్తాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ సర్పంచ్ LN రెడ్డి ఉప సర్పంచ్ రామకృష్ణ వార్డు సభ్యులు ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ PACS చైర్మన్ గంప వెంకటేష్ PACS డైరెక్టర్ జోగు వీరయ్య, వెంకటేష్, ఎంపిటిసిలు శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, తండా సర్పంచ్ హరిచంద్ నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జంగయ్య, టీఆరెస్ నాయకులు గంప శ్రీనివాస్బా, భాలకృష్ణ. లయక్ అలీ,శ్రీశైలం, జగన్ తదితరులు పాల్గొన్నారు.