అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన జె. జ్యోతి కి సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.200,000/- ల చెక్కును ఆయన అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదు అని వారి వైద్య సేవలకు అయిన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా మంజూరు చేయించినట్లు తెలిపారు.
అర్హులైన అందరికి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమకు సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి జ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రవి నాయక్, రాంబాబు, నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.