రాష్ట్రంలో బడుగు , బలహీన వర్గాల పేదలకు సిఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పథకం ఒక వరమని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 167 మంది లబ్దిదారులకు 60, 74,000 రూపాయల విలువ గల CMRF చెక్కుల పంపిణీలో పాల్గొన్న MLA మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య ప్రధాత సిఎం కేసిఆర్ అని, నిత్యం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం తెరాస ప్రభుత్వమని అన్నారు.
సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ది పొందుతున్నారని,పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలందరికీ లబ్ధిచేకూరేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.
కరోనా సమయంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు , 7 మండలాల జడ్పీటీసీ లు, ఎంపిలు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.