ప్రకాశం జిల్లా దోర్నాల – మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిలిచింది. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అర గంటపాటు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలు ముందుకు వెళ్తే వాటిని వెంబడిస్తుండడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత ఆ నాగుపాము వెళ్లిపోగా ట్రాఫిక్ క్లియర్ అయింది…!!
next post