భరించలేని శీతాకాలాలు దేశంలోని ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొగమంచు కారణంగా విమానాలు, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్డు ట్రాఫిక్, పొగమంచు దెబ్బతిన్నాయి. దీనితో పాటు ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకరమైన స్థాయికి దిగజారింది.
చలితో పాటు తేమ, గాలి వేగం పెరగడంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 100 సంవత్సరాల కనిష్టానికి చేరాయి. వరుసగా 15వ రోజు కూడా ఢిల్లీ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు చేరింది. ఇదే స్థాయిలో ఉత్తర భారత దేశం అంతటా ఉంది. దక్షిణ భారత దేశంలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రాత్రి వేళల్లో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిపోతున్నది.
దక్షిణాది రాష్ట్రాలలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కేరళలో 25 డిగ్రీలు ఉండగా తమిళనాడులో 23 డిగ్రీలకు పడిపోతున్నది. హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతల 22 డిగ్రీలకు చేరుకుంటున్నది. ఢిల్లీలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయింది. గరిష్ట ఉష్ణోగ్రత 13గా ఉంది.