ఖమ్మం జిల్లా చింతకాని మండలం, నేరడ గ్రామానికి చెందిన బి. వెంకన్న, ఎం. భూలక్ష్మి, జి. శాంతి కుమారి లకు దళితబంధు పథకం ద్వారా మంజూరయిన వరికోత యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేయి ఎకరాలకు ముందస్తుగా ఆర్డర్లు పొందాలని అన్నారు. వరి కోత ఏ ఏ ప్రాంతాల్లో చేపడితే అక్కడికి , దూర ప్రాంతాలైనా అక్కడికి వెళ్ళాలని ఆయన తెలిపారు. లబ్ధిదారులే డ్రైవర్ గా నిర్వహణ చేసుకోవాలని ఆయన అన్నారు. యంత్రం పంపిణీ చేసిన వారు శిక్షణ ఇవ్వాలన్నారు.
previous post