39.2 C
Hyderabad
April 25, 2024 17: 01 PM
Slider గుంటూరు

కేజీబీవీ స్కూల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

#palanadu

పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి రొంపిచర్ల మండలం, సంతగుడిపాడు వద్ద ఉన్న కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ )పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీ విద్యార్థులతో పలు అంశాలపై( సైన్సు, తెలుగు తదితర) ముచ్చటించి జవాబులు రాబట్టారు. ఇంగ్లీష్ గ్రామర్ లో కొంచెం వెనకబాటు ఉండడం గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించి ఇంగ్లీష్ గ్రామర్ పై పట్టు సాధించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పాఠశాల ఉపాధ్యాయునికి ఆదేశాలు జారీ చేశారు.

పదవ తరగతి తర్వాత ఏమి చదవాలి ఎలా చదవాలి అనే అంశంపై కెరీర్ గైడెన్స్ నిర్వహించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. పెద్ద ఎత్తున భవిత కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించి పదో తరగతి పాస్ అయిన పిల్లలకు ఏ చదువు ఎలా చదవాలి ఎలా ముందుకు సాగాలి అనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.

అదేవిధంగా నూతనంగా ప్రారంభించిన ఇంటర్ సిఇసి గ్రూప్ విద్యార్థులతో మాట్లాడుతూ క్లాసులు ఎలా జరుగుతున్నాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. దసరా సెలవులలో విద్యార్థినీ విద్యార్థులను ఎడ్యుకేషనల్ టూర్ కై విశాఖపట్నానికి తీసుకుని వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం  కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.

Related posts

బ్రిటన్‌లో విజృంభిస్తున్న మరో వైరస్.. సర్వత్రా గందరగోళం

Sub Editor

సైమన్ కమీషనుకు గుండెలు చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు

Satyam NEWS

సోము వీర్రాజు కు రాచమల్లు వార్నింగ్…..

Satyam NEWS

Leave a Comment