తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు 68 కళాశాలను మూసివేస్తూ ఇంటర్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు జారీ చేసిన వాటిలో 26 కాలేజీలు నారాయణ విద్యాసంస్థలు కాగా, 18 కాలేజీలు శ్రీచైతన్యకు చెందినవి. మొత్తం 68 కళాశాలలను మూసివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా ఈ మెయిల్ ద్వారా ఆయా కళాశాలలకు సమాచారమిచ్చామని ఆయన చెప్పారు.