గతేడాదికి గాను పోలీస్ విధులలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 12 మంది జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి డీజీపీ కమాండేషన్ డిస్క్ అవార్డులకు ఎంపిక అయ్యారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన (1) స్పెషల్ బ్రాంచ్ సిఐ జి.రాంబాబు (2) ఆర్ఎస్ఐ యు.నరసింగరావు, ఆర్మ్డ్ రిజర్వు (3) ట్రాఫిక్ ఎఎస్ఐ ఎస్. నాగాదిత్య (4) విజయనగరం రూరల్ ఎఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు (5) స్పెషల్ బ్రాంచ్ హెచ్ సి ఎం.ఆర్. సీహెచ్.శేఖర్ (6) డిసిఆర్ బి హెచ్ సి కే.రాజగోపాల్ (7) కానిస్టేబులు టి.శ్రీనివాస్ (8) కానిస్టేబులు వై.అప్పల నాయుడు (9) కానిస్టేబుల్ జి.రమేష్ (10) కానిస్టేబులు ఎం.హరి కృష్ణ (11) ఎఆర్ కానిస్టేబులు సిహెచ్.గోపాలరావు (12) ఎఆర్ హెచ్ సి డ్రైవరు టి.చెల్లం నాయుడు ఉన్నారు.
ఈ మేరకు విశాఖ లోని సిరిపురంలో ఉడా చిల్డ్రన్స్ ధియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ అవార్డులను బహుకరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు సేవ చేసే విధానంలో వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, తద్వారా పోలీసుల ప్రతిష్ట పెంచే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ సిటీ సీపీ మనీష్ కుమార్ సిన్హా ,విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు.విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ,డీసీపీ ఐశ్వర్య రస్తోగి, వి.ఎస్.పి సిటీ, ఎస్పీ . కృష్ణారావు విశాఖపట్నం జిల్లా ఎస్పీ, అమిత్ బర్ధర్ శ్రీకాకుళం జిల్లా రేంజ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.