అన్నమయ్య జిల్లా పోలీసు ఉద్యోగుల మరియు అధికారుల మనోభావాలు దెబ్బ తినేలా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు విమర్శించడం చాలా బాధ కలిగించిందను రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. ఎవరైనా సరేపోలీసులను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు.పార్టీ అధినేత ఎదుట మొప్పు పొందాలని పోలీసు వ్యవస్దను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారా ? అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న రాజంపేట టిడిపి ఇన్ చార్జి బత్యాల చెంగల్ రాయులు పోలీసులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయ మన్నారు.పోలీసు వ్యవస్థ మనో స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని,పోలీసులపై బత్యాల వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం, హేయ మన్నారు.చట్టం ఎవరి చుట్టం కాదని రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్లు నడుచుకోవచ్చేమోగాని పోలీసు వ్యవస్ద చట్టం ప్రకారం నడుచుకుంటుందన్నారు.నిత్యం శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తారని అందువల్లే దేశంలోనే ఏపీ పోలీస్ నంబరు వన్గా ఉందని ప్రశంసించారు.
తప్పు చేస్తే విమర్శించొచ్చు గానీ, పోలీసులు తప్పు చెయ్యక పోయినా కోర్టులో పోలీసులపై అపద్దాలు చెప్పాలనడం బత్యాల బరితెగింపుకు నిదర్శన మన్నారు.పోలీసులు కొట్టకపోయినా కోట్టారని అపద్దాలు చెప్పాలనటం ఏరాజనీతి అనిప్రశ్నించారు. అపద్దాలు చెప్పే విషయంలోను పెద్ద మనస్సు చేసుకోవాలని సలహా ఇవ్వడం బత్యాలకు తగునా ?అని అన్నారు. గతంలోను రైల్వేకోడూరు పోలీసులపై ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం బత్యాలకు అలవాటుగా మారిందన్నారు.పోలీసులపై అపద్దాలు చెబితే,కోర్టులో న్యాయ దేవతకు కళ్లకు గంతలు కట్టోచ్చు గానీ,అంత మాత్రానా వీళ్లు అపద్దాలు చెబితే న్యాయమూర్తి నమ్ముతారను కోవడం అవివేక మన్నారు. పోలీసులు గౌరవంగా ఉంటేనే మనకు గౌరవం అని వారు క్షేమంగా ఉంటేనే శాంతిభద్రతలను కాపాడతారని,ఏ నాయకుడైనా పోలీసు వ్యవస్థను కించపరిచేలా సహించేది లేదన్నారు.పోలీసు వ్యవస్థ మనో స్థైర్యం దెబ్బ తియ్యా లని చూస్తే సహించనని,పోలీసులకు నామద్దతు ఎప్పట్టికి ఉంటుందన్నారు.
పోలీసుల జోలికొస్తే ఎట్టి పరిస్దితుల్లోను ఉరుకునేది లేదని,ఒక పోలీసు శాఖ మాత్రమే కాదు ప్రభుత్వంలోని ఏ శాఖల అధికారులైనా ఉద్యోగులైన ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలకు కృంగి పోవాల్సిన అవసరం లేదని చిత్తశుద్ధితో మీ విధులు నిర్వర్తించండి, ప్రజా ప్రతినిధిగా నా యొక్క మద్దతు మీకు ఎప్పుడు ఉంటుందని భరోషా ఇచ్చారు.