కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతరాజకీయాలు చేస్తున్నదని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఏర్పాటు చేయబోయే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రజలే సామూహికంగా కలసి వచ్చి కూల్చుతారని ఆయన హెచ్చరించారు.
అబద్దాలు చెప్పి ఒక వర్గం ప్రజలను మోసం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే ప్రోద్దుటూరులో ప్రజలు అమాయకులనుకుంటున్నారా …? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఒక మతం ఓట్ల కోసం, వాళ్లను ఎన్నాళ్ళు మెూసం చేస్తారు రాచమళ్ళు గారు ?అని ఆయన ప్రశ్నించారు గత 18 న మీడియా సమావేశంలో, పురపాలక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి, టిప్పు విగ్రహ ఏర్పాటుకు తీర్మానం చేసామని ప్రజలకు అబద్దం చెప్పి వారిని మోసం చేశారని ఆయన గుర్తు చేశారు.
వాస్తవంగా 30/06/21న విగ్రహ ఏర్పాటుకు సంబంధించి, పురపాలక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. నాడు మీడియా సాక్షిగా రాచమల్లు రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినట్లే కదా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రొద్దుటూరులో ప్రజలు మీ అహంకారాన్ని త్వరలో కూలుస్తారు. చాలామంది మీలాంటి రాజ్యాంగేతర శక్తులు, రాజకీయ చరిత్రలో కాలగర్భంలో కనుమరుగైపోయారు అని ఆయన అన్నారు.