విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర ఎంతో శక్తిమంతుడు. ఆయనకు ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆయన రాజశ్యామల యాగం చేస్తున్నందున ఆంధ్రపదేశ్ రాష్ట్రం అప్పులు లేకుండా ఎంతో సుభీక్షంగా ఉంది.
ఆయన శక్తికి ఆకర్షితులైన ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు తరచూ విశాఖ శారదా పీఠం దర్శిస్తుంటారు. తాజాగా ఆయన ఆకర్షణ శక్తికి కమ్యూనిస్టులు కూడా బానిసలు అయిపోతున్నారు.
హిందూయేతరులను హిందువులకా మార్చడంలో ప్రతిభ చూపించిన స్వరూపానందేంద్ర స్వామి ఇప్పుడు కమ్యూనిస్టులను కూడా భక్తులుగా మార్చుకుంటున్నారు. పై విషయాలు అన్నీ ఎలా ఉన్నా భారత దేశంలోని కమ్యూనిస్టులను కూడా దేవుడి భక్తులుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న స్వరూపానందేంద్ర స్వామిని అభినందించకతప్పదు.
దేశంలోని కమ్యూనిస్టులు భక్తులగా మారిపోతే దేవుడికి కూడా అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. తాజాగా సీపీఐ నారాయణ స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందారు. కమ్యూనిస్టుల్లో కీలకమైన నాయకుడు… అదీ కూడా సీపీఐ కి జాతీయ కార్యదర్శి కావడానికి అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి అయిన నారాయణ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకోవడం భారత హిందూమతంలోనే మరపురాని ఘట్టంగా మిగిలిపోతుందనడంలో సందేహంలేదు.
విశాఖ శారదాపీఠంలో….. నారాయణ కామ్రేడ్ కాషాయ కండువా కప్పించుకున్నారు. స్వామీజీ దర్శనం చేసుకుని ఆయనకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు…ఆ తర్వాత స్వామీజీ నారాయణ మెడలో కండువా వేయడంతో వినమ్రతతో మరోసారి నమస్కరించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు….
ఇంతవరకు బాగానే ఉంది….కరడు గట్టిన కమ్యూనిస్టు నారాయణ శారదాపీఠానికి ఎందుకు వెళ్లినట్లు…? స్వామీజీ దర్శనం ఎందుకు చేసుకున్నట్లు అని మాత్రం ఆలోచించకండి….నారాయణలో భక్తి భావం పెరిగిందో లేక స్వామీజీని కలుసుకుని దర్శనం చేసుకోవాలనుకున్నారో ఏమో…..