39.2 C
Hyderabad
March 28, 2024 15: 02 PM
Slider కృష్ణ

పెట్రో ధరలపై విజయవాడలో వామపక్షాల నిరసన

#cpmprotest

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నేడు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. నేడు విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్  వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, వామపక్ష నేతలు సిహెచ్. బాబూరావు, డి.కాశీనాథ్, డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వీరిందరితో బాటు మహిళలతో సహా పెద్ద ఎత్తున కార్యకర్తలు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related posts

సిరిమానోత్సవానికి మూడంచెల పోలీసు భద్రత: ఎస్పీ దీపిక

Satyam NEWS

కోర్టుల చీవాట్ల వల్లే ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న నరేంద్రమోడీ

Satyam NEWS

తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న వ్యక్తి వైఎస్ఆర్

Satyam NEWS

Leave a Comment