పేద ప్రజల పక్షాన నిలిచేది వామపక్షాలేనని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు, యల్లావుల రమేష్ అన్నారు.
బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపాలిటీ లోని 17వ,వార్డు సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం కమిటీ సభ్యుడు జక్కుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సిపిఐ ముఖ్య భూమిక పోషిస్తుందని అన్నారు.
అనంతరం 17వ, వార్డు సిపిఐ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు కార్యదర్శిగా చక్రాల నాగరాజు, సహాయ కార్యదర్శిగా జక్కుల సందీప్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా నర్సింగ్ బన్సీలాల్,బత్తిని మల్లయ్య,ఆవుల లింగయ్య లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు దొంతగాని సత్యనారాయణ,చక్రాల వేంకటేశ్వర్లు, జక్కుల మట్టమ్మ, యరగాని మంగ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్