కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధించడంతో చాలా కంపెనీలు తమతమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనులు చేయాలని సూచించాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం చేయిస్తున్నాయి. అయితే దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లమెల్లగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తి స్థాయిలో కార్యాలయాల నుంచే ఉద్యోగులతో పనులు చేయించాలనే ఉద్దేశంతో ఉన్న కంపెనీలకు.. మరో తలనొప్పిగా మారింది.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరల్ వల్ల కంపెనీలు ఉద్యోగుల పట్ల పునరాలోచనలో పడ్డాయి. మళ్లీ వర్క్ ఫ్రం హోమ్కే మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడు కంపెనీలు తమ ఉద్యోగులను శాశ్వతంగా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేందుకు అంగీకరించాయి.