40.2 C
Hyderabad
April 24, 2024 18: 01 PM
Slider కృష్ణ

కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించిన రోషపతి

#CITUCHujurnagar

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామం వద్ద గల రాకెట్ కెమికల్స్ కర్మాగారంలో పని చేస్తూ ప్రమాదంలో మరణించిన ఏపూరి ప్రేమ్ కుమార్ కు హుజూర్ నగర్ సిఐటియుసి నాయకులు పరిహారం ఇప్పించడంలో కృతకృత్యులయ్యారు.

ప్రేమ్ కుమార్ రాంపురం లోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ లో పని చేసే సిఐటియు నాయకుడు కోటేశ్వర రావు కుమారుడు. 22 సంవత్సరాల ప్రేమ్ కుమార్ ప్రమాదవశాత్తూ మరణించడంతో ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

సంఘటన జరిగిన వెంటనే స్పందిచిన హుజూర్ నగర్ సిఐటియుసి నాయకుడు, సిఐటియుసి ఉపాధ్యక్షుడు శీతల రోషపతి హుటా హుటిన అక్కడకు వెళ్లి యాజమాన్యంతో చర్చలు జరిపారు. పర్సనల్ డిపార్ట్మెంట్ సోమయ్య, HR మణికుమార్ తో మేళ్లచెరువు ఎంపీపీ కె.సైదేశ్వర రావు, రాంపురం గ్రామ సర్పంచ్ మైల మల్లికార్జునరావు, సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి చర్చలు జరిపారు.

చర్చలు ఫలించి ప్రేమకుమార్ కుటుంబానికికి 35 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. అదే విధంగా సదరు కాంట్రాక్టర్ లక్షన్నర రూపాయలు పరిహారం ఇచ్చేందుకు కూడా అంగీకరించారు. ఆర్థిక సహాయం చేసిన యాజమాన్యానికి ఎంపీపీ సర్పంచ్ కి రోషపతి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణపక్ష ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సి ఐ టి యు అనుబంధం అధ్యక్షుడు తీగల శ్రీనివాసరావు, అజముద్దీన్,ప్రకాష్, అంకారావు, వైయస్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యుడు సైదులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్నేహితుల చేతుల్లోనే జ్ఞానేశ్వర్ హత్య

Satyam NEWS

అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పయనం

Satyam NEWS

ఇక సెలవు:దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు

Bhavani

Leave a Comment