27.7 C
Hyderabad
April 26, 2024 04: 35 AM
Slider ఖమ్మం

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేసిన ఎస్పీ

#Kothagudem Police

నిషేధిత మావోయిస్టు పార్టీ లో పనిచేసి జిల్లా పోలీసుల ముందు ఇటీవల లొంగిపోయిన నలుగురు మావోయిస్టు దళసభ్యులకు ప్రభుత్వం నుంచి అందిన రివార్డ్ నగదును ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తన కార్యాలయంలో అందజేశారు.

నిషేధిత మావోయిస్టు పార్టీ నందు పనిచేసి లొంగిపోయిన ఉబ్బ మోహన్ కు 4,00,000/-ల రూపాయలను, సోడి నరసింహారావు, అతని భార్య పోడియం సన్నీ లకు 8,00,000 ల రూపాయలను, పోడియం సంతోష్ కు 1,00,000/- ల నగదును చెక్కుల రూపంలో అందచేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ వారితో మాట్లాడుతూ పునరావాస చర్యలలో భాగంగా  ప్రభుత్వం ద్వారా త్వరితగతిన నగదును అందేలా చేశామని చెప్పారు. ఈ నగదును పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలని సూచించారు. నిషేధిత మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేవారికి ప్రభుత్వం తరపున అందవలసిన ప్రతిఫలాలను అందేవిధంగా చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రమణారెడ్డి,భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఎసిబి ఇన్స్పెక్టర్ రవి పాల్గోన్నారు.

Related posts

సూర్యాపేట పట్టణంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు

Satyam NEWS

సారీ రోశయ్య గారూ… మిమ్మల్ని మర్చిపోయాం….

Satyam NEWS

అధునాతన మట్టి పాత్రల తయారీ యంత్రాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment