28.2 C
Hyderabad
April 20, 2024 13: 48 PM
Slider ప్రత్యేకం

అధికారం దుర్వినియోగం చేస్తున్న సీఐడీ అదనపు డీజీ

#pvsunilkumarips

సీఐడీ అదనపు డీజీ హోదా, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తూ పీవీ సునీల్​కుమార్ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆయన మామ సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా తమ కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారని సుబ్బారావు అన్నారు.

తన కుమార్తెను సునీల్ వివాహం చేసుకున్న తర్వాత అధిక సొమ్ము, కారులు, వ్యవసాయ భూములు, ఆభరణాలు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారన్నారు. కేసును ఉపసంహరించుకోక పోతే జైలుకు పంపుతానంటూ సునీల్ బెదిరించారని సుబ్బారావు అన్నారు. తమ కుటుంబ సభ్యులను వేధించడాన్ని చట్టవిరద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు.  

అదే విధంగా ఈ అంశంపై  కేంద్ర విజిలెన్స్ కమిషన్​తో దర్యాప్తు జరిపించాలని కోరారు. తమకు భద్రత కల్పించడం సహా సీఐడీ అదనపు డీజీ పోస్టుకు అన్ని విధాలా న్యాయం చేసే అధికారిని నియమించేలా కేంద్ర, రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు.

Related posts

జగన్ రెడ్డి అసమర్థ పాలనతో పోలవరం భవిష్యత్  ప్రమాదం

Satyam NEWS

ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

Satyam NEWS

సమగ్ర శిక్షా అభియాన్ లో అందరికి వేతనాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment