తెలంగాణ దళిత దండు వ్యవస్థాపకుడి పై గత గురువారం కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకటరమణ దురుసుగా మాట్లాడుతూ దాడి చేసిన ఘటనపై బాధితుడు బచ్చల కూర బాలరాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేశారు.
ఇది వరకే డిఎస్పీ, సీఐకి కూడా పిర్యాదు చేశారు. సోమవారం దళిత ప్రజా సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొల శివ, మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్, దళిత దండు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్, కమలాపూరీ మద్దిలేటి, కొల్లాపూర్ తాలూకా ఇంచార్జ్ ఎర్ర శీను, మారాడి కురుమయ్య బచ్చలకూర బాలరాజు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుడు బచ్చల కూర బాలరాజుతో కలిసి దళిత సంఘాల నాయకులు ఫిర్యాదును ఎస్పీ కార్యాలయ సీసికి అందచేశారు. దళితుడని తెలిసి కక్షపూరితంగా దాడి చేసిన కొల్లాపూర్ ఎస్ఐ జి. బాల వెంకటరమణ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి సంబంధించిన అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు.