27.7 C
Hyderabad
April 26, 2024 04: 26 AM
Slider విశాఖపట్నం

కార్మిక మంత్రి కుమారుడికి కారు బహూకరణ

#Aiyyannapatrudu

కార్మిక శాఖ మంత్రి జయరాం, కుమారుడు ఈశ్వర్ కి ఈ ఎస్ ఐ కుంభకోణంలో 14 వ నిందితుడు కార్తీక్  కార్ బహుకరించిన అంశాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కి తెలిపారు.

 విశాఖపట్నం నుంచి ఆయన నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరాం, కుమారుడు గుమ్మలూరు ఈశ్వర్ కు ఖరిదయిన బెంజ్ కార్ ను ఈ ఎస్ ఐ కేసులో 14 వ నిందితుడు తెలకపల్లి కార్తిక్ బహుకరించాడు.

అసలు ఈ ఎస్ ఐ కుంభకోణంలో ఉన్న 14 వ నిందితుడు కార్తిక్ కి మంత్రి కొడుకు ఈశ్వర్ కి సంబంధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. పుట్టిన రోజు బహుమతిగా ఈ కార్ ఇవ్వలేదు, లంచంగా ఇచ్చిన వస్తువు ఇది అని ఆయన అన్నారు.

ఈ ఎస్ ఐ  కుంభకోణంలో ప్రధాన నిందితుడు కార్మిక శాఖ మంత్రి జయరాం, ఆయన బినామీ ఈశ్వర్ అని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.

అవినీతి సహించను అని చెప్పే సీఎం జగన్ ఏ సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. జయరాం ను వెంటనే పదవి నుంచి తప్పించి, న్యాయ వ్యవస్థ తో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Related posts

బిగ్ ప్రాబ్లం: అరెస్ట్ అయితే చేసారు కానీ తరలింపు ఎలా

Satyam NEWS

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

Satyam NEWS

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Satyam NEWS

Leave a Comment