Slider మహబూబ్ నగర్

పెబ్బేరు ఎస్ఐపై డిజిపికి పిర్యాదు చేసిన రాచాల

#rachala2

వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐపై డిజిపికి పిర్యాదు చేశామని తెలంగాణ బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. పెబ్బేరులో గోదాములో గొనె సంచులు కాలినా చర్యలు లేవని, ఇసుక, రేషన్ బియ్యం మాఫియాతో కుమ్మక్కయ్యారని, అక్రమాలు చేశారని, ఎస్ఐని ఉద్యోగం నుండి తొలగించాలని కోరారు.ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని అయన అన్నారు. ఎస్ఐ అరాచకం, అక్రమాల గురించి తెలిసినా జిల్లా ఎస్పీ, ఐజి పట్టించుకోవడం లేదని అయన చెప్పారు. పెబ్బేరు ఎస్ఐని డ్యూటీ నుండి తప్పించి విచారణ చేయాలని అయన కోరారు. ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారని అయన తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మొక్కల సంరక్షణ మనందరం బాధ్యతగా స్వీకరించాలి

Satyam NEWS

ప్రైవేటు స్కూళ్లు జీవో నెం.46 ను ఉల్లంఘిస్తే ఉద్యమం తప్పదు

Satyam NEWS

సక్సస్ స్టోరీ :కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంతో ఉపాధి

Satyam NEWS

Leave a Comment