బైంసాలో హిందువులను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన వారి అరాచకాలను బయటపెట్టిన జర్నలిస్టుపైనే కేసులు పెట్టిన తెలంగాణ పోలీసులపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి జి.కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బైంసాలో జరిగిన మొత్తం వ్యవహారాన్ని జర్నలిస్టు సిద్దూ బయటకు తీసుకువచ్చారని అలాంటి వ్యక్తి పై కేసు పెట్టడం అన్యాయమని ఆయన అన్నారు.
మతతత్వ ఉగ్ర మూకల అరాచకాలను బయటపెట్టిన జర్నలిస్టు సిద్దూ ను సన్మానించాల్సింది పోయి తెలంగాణ పోలీసులు ఈ విధంగా కేసులు నమోదు చేయడం శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులతో నమోదు చేయించిన అక్రమ కేసులు గూర్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నేడు ఎంపీ బండి సంజయ్ వివరించి చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.