31.7 C
Hyderabad
April 24, 2024 23: 31 PM
Slider కడప

తొలగించిన పింఛన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలి

complaint

కొత్త కలెక్టరేట్ లో నేడు జరిగిన స్పందన కార్యక్రమంలో పింఛన్ల పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ హరి కిరణ్ ను కలసిన తెలుగుదేశం పార్టీ నేతలు రద్దయిన పింఛన్లపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసేసిన పింఛన్లను వెంటనే ఇవ్వాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

రద్దు చేసిన రేషన్ కార్డులను వెంటనే మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7 లక్షల పింఛన్లు 20లక్షలు రేషన్ కార్డుల రద్దుపై నేడు కడప జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా టి.ఎన్. ఎస్.ఎఫ్. అధ్యక్షుడు వేణుగోపాల్, బి.సి.సెల్ జిల్లా కార్యదర్శి మాసా కోదండరామ్, నాయకులు సుబ్బారెడ్డి, ఆమీర్ బాష తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధరూర్ వంతెన వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

Satyam NEWS

మోర్బీ బ్రిడ్జి కూలిన సంఘటనపై ప్రభుత్వం నోరుమెదపదేం?

Satyam NEWS

ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్రం నిషేధం

Satyam NEWS

Leave a Comment