స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అధికార వైసిపి పార్టీ నేతల కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందుల పాలుచేసిన పోలీసుల వైఖరిపై నేడు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ కు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు లోని ఎస్పీ బంగ్లా వద్ద జరిగిన ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి పరసా రత్నం, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ వేయకుండా అడ్డుకుంటూ, నామినేషన్ వేసిన టిడిపి అభ్యర్థులు భయబ్రాంతులకు గురి చేస్తూ విత్ డ్రా చేయించిన పోలీసుల వైఖరి పై జిల్లా ఎస్పీకి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ నేతలకు అనుకూలంగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని అన్నారు.
పెళ్లకూరు మండలం ఎంపీడీవో కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన టిడిపి ఎంపిటిసి, జెడ్పీటీసీ అభ్యర్థులను వైసిపి ఎంపీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు అడ్డుకొని నామినేషన్ వేయకుండా భయ భ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం.
టిడిపి అభ్యర్థులకు మద్దతుగా కారులో బయలుదేరి న మాజీ మంత్రి పరసా రత్నం ను అడ్డుకుని, కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసినా పోలీసులలో స్పందన లేదు. పెళ్లకూరు జెడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు టిడిపి కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం కి కారు లో బయలుదేరిన టిడిపి అభ్యర్థి రావినూతల మస్తానమ్మ ను మార్గమధ్యంలో అటకాయించి బలవంతంగా వాహనంలోకి ఎక్కించి నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం.
సూళ్లూరుపేట లో మిగిలిన ఐదు జడ్పిటిసి స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి అభ్యర్థులు భయభ్రాంతులకు గురిచేసి విత్ డ్రా చేయించడం లో పోలీసులు కీలకంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రాపూరు మండలం , పెనుబర్తి లో పోటీలో ఉన్న ఎంపిటిసి అభ్యర్థి తన ప్రమేయం లేకుండా తన పేరుతో బురఖా ధరించిన వ్యక్తి విత్ డ్రా చేసుకున్నారని ఎస్ఐ కి విన్నవించినా పట్టించుకోలేదు.
వైసీపీ నాయకుల ఒత్తిడితో సీతారాంపురం జెడ్ పి టి సి అభ్యర్థి దంపతులను ఇంటి నుంచి తీసుకువచ్చి న ఉదయగిరి సీఐ వైసీపీ శాసన సభ్యులు ఇంట్లో వదిలిపెట్టి ఎమ్మెల్యే కి అప్పగించి వెళ్ళడం, నామినేషన్ విత్ డ్రా అయ్యేలా ఒత్తిడికి గురి చేయడం దుర్మార్గం.
నామినేషన్ విత్ డ్రా సమయం ముగిశాక విత్ డ్రా లు మరియు బి ఫారాలు తీసుకుంటున్న అధికారులను ప్రశ్నించేందుకు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్ళిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆయన పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం.
ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో హింస పూరితమైన సంస్కృతిని తీసుకువస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరాం. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాకర్ల తిరుమల నాయుడు, అమ్రుల్లా, సిహెచ్ దత్తాత్రేయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.