Slider మహబూబ్ నగర్

పోలీస్ ప్రజావాణిలో  కార్యక్రమంలో 8 పిర్యాదులు

#prajavani

వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా  ఎస్పీ  రావుల గిరిధర్ ప్రజావాణిలో ఫిర్యాదులను తీసుకున్నారు.  సమస్యలను విని వాటిని  పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 8 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల ఎస్ఐ, సిఐ లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య  పరిష్కారానికి సూచనలు చేశారు. పోలీసులు ప్రజలకు  దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని  ఎస్పీ చెప్పారు. పోలీస్ ప్రజావాణిలో  మొత్తం 08ఫిర్యాదులు ఉన్నాయి. 4 భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు 4, పరస్పర గొడవల కు  సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వనపర్తి అవినీతి అధికారి పై  ఫిర్యాధు చేస్తాం

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

కర్నాటక నుంచి తెలంగాణకు వస్తున్న డూప్లికేట్ గుట్కా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!