వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రజావాణిలో ఫిర్యాదులను తీసుకున్నారు. సమస్యలను విని వాటిని పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 8 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించారు. పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల ఎస్ఐ, సిఐ లతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి సూచనలు చేశారు. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని ఎస్పీ చెప్పారు. పోలీస్ ప్రజావాణిలో మొత్తం 08ఫిర్యాదులు ఉన్నాయి. 4 భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు 4, పరస్పర గొడవల కు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్