ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యఎస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ఫిర్యాదులపై సిపి గారు స్వీకరించి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు,ఇతర ఫిర్యాదులు వరకు వచ్చాయి. ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సూచించారు.
previous post