భర్త తనతో శృంగారం చేయకుండా తనపై దాడి చేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ భార్య ఫిర్యాదు చేసింది. గుజరాత్లోని సుర్ఖేజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దనిలిమ్దా ప్రాంతంలో 2016లో ఓ యువకుడిని ఆ యువతి పెళ్లి చేసుకుంది. ఆ దంపతులకు 2018లో ఒక పాప జన్మించింది.
అయితే గత కొన్ని రోజుల నుంచి తన భర్త కాపురం చేయడంలేదని ఆమె అంటున్నది. కాపురం చేయమని కోరితే రోజు తనపై దాడి చేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తన భర్త బ్రహ్మచర్య తీసుకొని, ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేయడంతో తనపై అత్తింటి వారు దాడి చేశారని తెలిపింది.
గత కొంతకాలంగా తన భర్త అప్పులు చేశాడని, పాపను సరిగ్గా చూసుకోవడం లేదని కూడా ఆమె తెలిపింది. పాపకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అతడు పట్టించుకోలేదని తెలిపింది. దీంతో పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.