రాష్ట్రవ్యాప్తంగా వచ్చే కొత్త విద్యాసంవత్సరం(2023-24) లో 600 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. మరో 600 బడులకు స్మార్ట్ తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. 200 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) మాడ్యులర్ కిచెన్లు ఏర్పాటు కానున్నాయి.
అందుకు సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద మొత్తం రూ.1,913 కోట్లకు కేంద్ర విద్యాశాఖ ఆమోదం తెలిపింది. ఎస్ఎస్ఏ కింద మంజూరైన నిధులతో ఆయా పనులను చేపట్టాల్సి ఉండగా,అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతాన్ని భరిస్తాయి.